తెలంగాణ రాష్ట్రంలో మరో 837 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 26, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,32,671 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1315 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.
ఇక సోమవారం నాడు 1554 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో రికవరీ అయినవారి సంఖ్య 2,13,466 కి చేరింది. ప్రస్తుతం 17,890 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా రికవరీ శాతం 91.14 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 185, ఖమ్మం జిల్లాలో 76, రంగారెడ్డిలో 59, కరీంనగర్ లో 51, భద్రాద్రి కొత్తగూడెంలో 48, మేడ్చల్ లో 41, సిద్దిపేటలో 40 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu