దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. కాగా జనవరి 3, 2022 నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు, అలాగే జనవరి 10,2022 నుంచి హెల్త్కేర్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ కు, 60 ఏళ్లు వయసు పైబడి కోమార్బిడిటీస్ (సహ-అనారోగ్యాలు) ఉన్నవారికి వారి యొక్క వైద్యుల సలహాపై ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి మొత్తం 149 కోట్లకుపైగా (1,49,70,76,985) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు.
అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు దాదాపు 17 కోట్ల (16,93,09,031) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరోవైపు దేశంలో డిసెంబర్ 30, గురువారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 143.83 కోట్లు (1,43,83,22,742) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 63,91,282 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణి చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ