దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 96 లక్షలకుపైగా (96,43,238) కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే జనవరి 3, 2022 నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ కేటగిరి కింద ఇప్పటివరకు 85,11,766 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపారు.
ఇక జనవరి 5, బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 147.72 కోట్లు (147,72,08,846) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వ్యాక్సినేషన్ పై మళ్ళీ ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ