కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజులోనే 3 మిలియన్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి భారత్ మరో ఘనతను సాధించింది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 59వ రోజైన మార్చి 15, సోమవారం నాడు ఒక్కరోజే 30 లక్షలకుపైగా (30,39,394) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 26,27,099 లబ్దిదారులకు మొదటి డోస్, 4,12,295 మంది లబ్దిదారులకు సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు.
అలాగే మంగళవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 3.29 కోట్లు (3,29,47,432) దాటినట్టు పేర్కొన్నారు. ఇందులో 74,46,983 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 44,58,616 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 74,74,406 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్), 14,09,332 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు), 1,02,69,368 మంది 60 ఏళ్లు పైబడినవారికీ (మొదటి డోసు), 18,88,727 మంది కొమొర్బిడిటీస్ తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికీ (మొదటి డోసు) కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ