కామన్ వెల్త్ గేమ్స్-2022 లో ఏడో రోజైన ఆగస్టు 4, గురువారం నాడు భారత్ ఖాతాలో మరో 2 (ఒక స్వర్ణం, ఒక రజతం) పతకాలు చేరాయి. పారా హెవీ వెయిట్లిఫ్టింగ్లో సుధీర్ స్వర్ణం సాధించగా, లాంగ్జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం గెలుచుకున్నాడు. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 6 స్వర్ణ, 7 రజత, 7 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 20 పతకాలు చేరాయి.
పారా పవర్ లిఫ్టర్ సుధీర్ 134.5 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. సుధీర్ మొదటగా 208 కేజీలు లిఫ్ట్ చేసి 132.0 పాయింట్ల సాధించగా, రెండవ ప్రయత్నంలో 212 కేజీలు ఎత్తి 134.5 పాయింట్లకు చేరాడు. అయితే చివరి ప్రయత్నంలో 217 కేజీలు బరువును ఎత్తలేకపోయాడు. అయినప్పటికీ కామన్వెల్త్ గేమ్స్ రికార్డును అధిగమిస్తూ 134.5 పాయింట్లతోనే స్వర్ణం సాధించాడు. ఇక మురళీ శ్రీశంకర్ లాంగ్ జంప్లో రజత పతకాన్ని సొంతం చేసుకుని అథ్లెటిక్స్ లో భారత్ కు రెండో పతకాన్ని అందించాడు. కామన్ వెల్త్ గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మొదటి భారతీయ అథ్లెట్ గా నిలిచాడు.
లాంగ్ జంప్లో తన ఐదవ ప్రయత్నంలో 8.08 మీటర్ల దూరం దూకిన మురళీ శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సాధించాడు. స్వర్ణం గెలుచుకున్న బహమాస్కు చెందిన లకాన్ నైర్న్ కూడా 8.08 మీటర్లే దూకినప్పటికీ, అతని రెండవ బెస్ట్ ప్రదర్శన (7.98 మీ), మురళీ శ్రీశంకర్ రెండో బెస్ట్ (7.84 మీ) కంటే మెరుగ్గా ఉండడంతో అతనికి స్వర్ణాన్ని ప్రకటించారు. పతకాలు గెలుచుకున్న పారా పవర్ లిఫ్టర్ సుధీర్ కు, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY