దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 పాజిటివిటీ రేటు, ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నమోదు అధికంగా ఉంది. ఢిల్లీలో సోమవారం 19,166 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ (డీడీఎంఏ) అథారిటీ అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకుంది. నూతన కోవిడ్ నిబంధనల ప్రకారం ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలను మూసివేసి, ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మాత్రమే అమలు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. కేవలం అత్యవసర సేవలుగా పరిగణించబడే కార్యాలయాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.
ఇక ఇప్పటివరకు ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో కార్యాలయంలో, మిగిలిన 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తుండగా తాజాగా ఉద్యోగులు అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం ఉద్యోగుల హాజరుతో పని చేస్తున్నాయి. అలాగే ఢిల్లీ రెస్టారెంట్లు మరియు బార్లను మూసివేయాలని, కేవలం టేక్అవేలు, హోమ్ డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ (డీడీఎంఏ) అథారిటీ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ