ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన కేబినెట్ లోని ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఇడి) అరెస్టు చేయడంపై కేంద్రంపై మండిపడ్డారు. ఇది ఫేక్ కేసు అని, సత్యేందర్ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తాను ప్రత్యేకంగా దీనిపై సమాచారాన్ని తెప్పించుకున్నానని, ఒకవేళ అతను తప్పు చేసి ఉంటే తానే చర్యలు తీసుకునేవాడినని కేజ్రీవాల్ తెలిపారు. ‘ఆప్’ నిజాయితీగల రాజకీయ పార్టీ అని ఇలాంటి అవినీతిని సహించదని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణపై పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాష్ట్ర మంత్రివర్గం నుండి ఇటీవల తొలగించిన విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాగా సత్యేందర్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సంవత్సరంలో కోల్కతాకు చెందిన ఓ కంపెనీ జరిపిన మనీలాండరింగ్ లావాదేవీలకు సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలు షెల్ కంపెనీల నంచి సత్యేందర్ జైన్కు రూ.4.81 కోట్లు ముట్టినట్లు తమ దర్యాప్తులో తేలిందని, దీనికి తగిన ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కేసుకి సంబంధించి కొన్ని రోజుల క్రితం సత్యేందర్ జైన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ అధికారులు గుర్తు చేశారు. అయితే సత్యేందర్ జైన్ను జూన్ 9 వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF