ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు సెక్రటేరియట్లోని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం దాడులు నిర్వహించింది. సిసోడియా ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపిస్తూ ఈ కేసులో విచారణ మధ్య సీబీఐ పదేపదే సోదాలు జరుపుతోంది. గతంలో కూడా ఒకసారి ఆయన కార్యాలయం, ఇంటిపై సీబీఐ దాడులు చేయడం తెలిసిందే.
आज फिर CBI मेरे दफ़्तर पहुँची है. उनका स्वागत है.
इन्होंने मेरे घर पर रेड कराई, दफ़्तर में छापा मारा, लॉकर तलशे, मेरे गाँव तक में छानबीन करा ली.मेरे ख़िलाफ़ न कुछ मिला हैं न मिलेगा क्योंकि मैंने कुछ ग़लत किया ही नहीं है. ईमानदारी से दिल्ली के बच्चों की शिक्षा के लिए काम किया है.— Manish Sisodia (@msisodia) January 14, 2023
దీనిపై సిసోడియా తన ట్విట్టర్ వేదికగా ఇలా తెలిపారు.. ‘ఈరోజు మళ్లీ సీబీఐ నా కార్యాలయానికి చేరుకుంది, వారికి స్వాగతం. సీబీఐ అధికారులు నా ఇంటిపై దాడి చేశారు, మరియు నా కార్యాలయంపై దాడి చేశారు, నా లాకర్ను సోదా చేశారు. మా గ్రామంలో విచారణ కూడా నిర్వహించారు. అయినా కూడా నాకు వ్యతిరేకంగా ఏమీ కనుగొనబడలేదు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నాకు వ్యతిరేకంగా వారికి ఏమి దొరకలేదు’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE