తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని తెలిపారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన లేఖలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని, న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా పారిశ్రామిక రంగంలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను చాటుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ సమావేశాలు ఉపకరించనున్నాయని, అందుకే ఈ బడ్జెట్లోనైనా రాష్ట్రానికి నిధులు కేటాయించడం ద్వారా అన్ని రాష్ట్రాలు తమకు సమానమే అని నిరూపించుకోవాలని సూచించారు. జహీరాబాద్ నిమ్జ్లో మౌలిక సదుపాయాల కల్పనకు, అలాగే హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్కు మరియు హైదరాబాద్ – నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లకు నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE