ప్రఖ్యాత పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నాయకుడు సుందర్లాల్ బహుగుణ కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిన అనంతరం చికిత్స కోసం మే 8న రిషికేశ్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. 1973 లో హిమాలయాల పర్వత ప్రాంతంలో అడవుల నరికివేతను వ్యతిరేకిస్తూ
ఆయన ప్రారంభించిన చిప్కో ఉద్యమం సంచలనంగా నిలిచింది. చిప్కో ఉద్యమంతో సుందర్లాల్ బహుగుణ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
అలాగే టెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమంలో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ 1981లో పద్మశ్రీ, 2009లో పద్మ విభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది. సుందర్లాగ్ బహుగుణ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ