ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికాలోని ఎస్వాతినీ దేశ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో ద్లామిని(52) కరోనా బారినపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. నాలుగు వారాల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, మెరుగైన చికిత్స కోసం ఇటీవలే దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా ఆ దేశ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఎస్వాతినీ దేశ ప్రధానిగా ఆంబ్రోస్ 2018 నవంబర్ నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ఎస్వాతినీ నెడ్బ్యాంక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పనిచేయడంతో పాటుగా 18 ఏళ్లకు పైగా బ్యాంకింగ్ రంగంలో కీలక సేవలు అందించారు. సుమారు 1.2 మిలియన్ల జనాభా గల ఎస్వాతినీ దేశంలో ఇప్పటివరకు 6,768 కరోనా పాజిటివ్ కేసులు, 127 మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ