నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిరసనలో చేరిన హర్యానాకు చెందిన సిక్కు మతపెద్ద సంత్ బాబా రామ్ సింగ్(65) ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సింఘు సరిహద్దులో తన లైసెన్స్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా కోపం, బాధను వ్యక్తం చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.
“హక్కుల కోసం రైతులు పోరాటం చేస్తూ పడుతున్న బాధలను ప్రత్యక్షంగా చూస్తూ అనుభవిస్తున్నాను. ప్రభుత్వం వారికి న్యాయం చేయనందున వారి బాధలను పంచుకుంటాను. అన్యాయం చేయడం పాపం, కానీ అన్యాయాన్ని సహించడం కూడా పాపం. రైతులకు మద్దతు ఇవ్వడానికి, కొందరు తమ అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. నేను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను” అని తన సూసైడ్ నోట్ లో బాబా రామ్ సింగ్ పేర్కొన్నారు. కారులో బాబా రామ్ సింగ్ తనని తాను కాల్చుకున్న అనంతరం ఆయన్ను పానిపట్ లోని పార్క్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించినట్టు తెలిపారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన హర్యానాలోని కర్నాల్ కు తరలించి శుక్రవారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన అనుచరులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ