డిసెంబర్ 31లోగా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయని.. అవి కచ్చితంగా పూర్తి చేయాలని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పనులకు డబ్బుకు లింకుండటంతో.. గడువులోగా ఆ పనులు పూర్తి చేసుకోవాలని.. లేదంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు.
ఆ పనుల్లో డీమ్యాట్ అకౌంట్ నామినేషన్ దగ్గర నుంచి హోమ్ లోన్ ఆఫర్, ఎస్బీఐ ఆఫర్ వరకు ఉన్నాయి. అందులో కొన్ని కచ్చితంగా చేయాల్సినవి ఉంటే మరికొన్ని అవి చేస్తే ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుంది.
డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాల్సిన పనులివే..
ఐటీఆర్ ఫైల్ చేయాలి..
2022-23 ఫైనాన్సియల్ ఇయర్లో లేట్ ఫీజుతో.. ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ లోగా ఐటీ పత్రాలన్నీ దాఖలు చేయలేకపోతే ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు ఇంటికే వచ్చే అవకాశం ఉంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి, ట్యాక్స్ కట్టాల్సిన ఇన్కమ్ రూ.5 లక్షల లోపు ఉన్న వాళ్లు రూ.1,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.5 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వ్యక్తులు రూ.5000 ఫైన్ చెల్లించాలి.
యూపీఐ ఐడీ డీయాక్టివేషన్..
వన్ ఇయర్ నుంచీ యూపీఐ ఐడీని ఉపయోగించని కస్టమర్లపై ఆయా బ్యాంకులు దృష్టి పెట్టాయి. అలాంటి యూపీఐ ఐడీలన్నీ డిసెంబర్ 31 తర్వాత డీయాక్టివేట్ అవుతాయి. అందుకే గత ఏడాదిగా దానిని పక్కన పెట్టిన వారంతా అర్జంటుగా ఆ యూపీఐ ఐడీని వాడి చిన్నదో, పెద్దదో ఓ ట్రాన్జాక్షన్ చేయాలి. లేదంటే యూపీఐ ఐడీ డీయాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు మళ్లీ బ్యాంకు వెళ్లి అప్ డేట్ చేసుకునేవరకూ ఆ ఐడీ పనిచేయదు.
డీమ్యాట్ అకౌంట్లో నామినేషన్ ..
మీ మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే.. మీ అకౌంట్లలో నామినేషన్ ప్రాసెస్ను వెంటనే పూర్తి చేయాలి. దీని లాస్ట్ డేట్ కూడా 2023 డిసెంబర్ 31 వరకే. ఈ పని పూర్తి చేయకపోతే, మీ మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. తిరిగి నామినీ ప్రాసెస్ యాడ్ చేసిన తర్వాతే యాక్టివేట్ అవుతుంది. అంటే అప్పటి వరకు మీ అకౌంట్లో ఏ ట్రాన్జాక్షన్ చేయలేరన్న మాట.
బ్యాంక్తో లాకర్ అగ్రిమెంట్..
కొత్త లాకర్ అగ్రిమెంట్పై సంతకం చేయడానికి.. తమ కస్టమర్లందరికీ డిసెంబర్ 31, 2023 వరకు ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ గడువు విధించింది. ఒక బ్యాంక్ లాకర్ ఉండి, ఇంకా కొత్త అగ్రమెంట్పై సంతకం చేయకపోతే, వీలైనంత త్వరగా బ్యాంక్కు వెళ్లి అగ్రిమెంట్ చేసుకోవాలి. లేకపోతే తర్వాత ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎస్బీఐ అమృత్ కలశ్ పథకం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ..స్ఫెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయిన అమృత్ కలశ్లో పెట్టుబడి పెట్టడానికి ఉన్న ఆఖరు తేదీ డిసెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ స్కీమ్ కింద, సాధారణ కస్టమర్లు 400 రోజుల స్పెషల్ ఎఫ్డీ మీద 7.10 శాతం ఇంట్రస్ట్ రేటు పొందుతారు. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.60 శాతం ఇంట్రస్ట్ రేటు పొందుతారు.
హోమ్ లోన్ ఆఫర్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రత్యేక హోమ్ లోన్ ఆఫర్ గడువు కూడా డిసెంబర్ 31తోనే ముగుస్తుంది. హోమ్ లోన్ తీసుకునేవాళ్లకు ప్రాసెసింగ్ ఫీజు మీద 0.17 శాతం వరకూ తగ్గుతుంది. అలాగే దీంతోపాటు 8.40 శాతం వడ్డీకే హోమ్ లోన్ తీసుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY