మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు జైసింగ్రావ్ గైక్వాడ్ పాటిల్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తన రాజీనామా లేఖను మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్కు పంపించారు. రాష్ట్ర బీజేపీ విభాగానికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని గైక్వాడ్ పాటిల్ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఒక సీనియర్ నాయకుడిగా పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నపటికీ, పార్టీ తనకు అవకాశం ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు గైక్వాడ్ పాటిల్ వెల్లడించారు. తాను గతంలో కేంద్రంతో పాటుగా మహారాష్ట్రలో కూడా మంత్రిగా పనిచేశానని, పార్టీ అభివృద్ది, నిర్మాణం కోసం పనిచేసే వారిని పార్టీ కోరుకోవడం లేదని విమర్శించారు. మరోవైపు ఇటీవలే బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే కూడా పార్టీకి రాజీనామా చేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లో చేరిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ