గుజరాత్ కేడర్ సీనియర్ ఐపిఎస్ అధికారి మనోజ్ శశిధర్ ను దేశ ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరెక్టర్గా నియమించారు. ఈ మేరకు జనవరి 17, శుక్రవారం నాడు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో హోంమంత్రి అమిత్ షా మరియు ఇతరులు సభ్యులుగా ఉన్న కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) మనోజ్ శశిధర్ నియామకానికి ఆమోదం తెలిపింది. 1994 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన శశిధర్ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం తన కేడర్ రాష్ట్రమైన గుజరాత్లో స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డీజీ గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు గుజరాత్ లోని పలు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో పలు విభాగాల్లో మనోజ్ శశిధర్ సేవలందించారు.
[subscribe]