చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను మెయిన్టెయిన్ చేస్తున్నారు. అయితే వాటిల్లో ఏదో ఒకటి, రెండు మాత్రమే వాడుతూ మిగిలిన వాటిని పక్కన పెట్టేస్తున్నారు. దీనివల్ల కొంత కాలానికి అలాంటి అకౌంట్లను బ్యాంకులు డీ యాక్టివేట్ చేస్తాయి. బ్యాంకులు నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడానికి ఇలా చేస్తాయి.
ఒక అకౌంట్ పదేళ్ల కంటే ఎక్కువ కాలం పాటు డీయాక్టివేట్ అయి ఉంటే.. అందులో ఉన్న బ్యాలెన్స్ లేదా క్లెయిమ్ చేయని డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బ్యాంకులు బదిలీ చేసేస్తాయి. ఒకవేళ అలా కనుక బదిలీ అయతే ఈ ఫండ్ నుంచి నిధులను క్లెయిమ్ చేయడానికి,ఆర్బీఐని సంప్రదించాల్సి వస్తుంది.
ఒక అకౌంట్ వాడలేనప్పుడు దాని గురించి బ్యాంకులు అకౌంట్ హోల్డర్లకు నోటీసులు పంపిస్తుంది. అప్పుడు బ్యాంకుకు వెళ్లి ఆ అకౌంట్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. సాధారణంగా 90 రోజులలో నిర్దిష్ట కాల వ్యవధిలో లావాదేవీని నిర్వహించినా కూడా ఆ ఖాతాను తిరిగి యాక్టివేట్ అవుతుంది. అకౌంట్ హోల్డర్ ఈ టైమ్లోగా అకౌంట్ను యాక్టివేట్ చేసుకోకపోతే..ఎక్స్ట్రా ఫైన్ విధించడం లేదా ఖాతాను మూసివేయడానికి ఆ బ్యాంక్కు అధికారం ఉంటుంది.
ఎక్కువ అకౌంట్లు ఉంటే క్లోజ్ అయినా చేసేయాలి లేదంటే ప్రతీ రెండేళ్లకు అయినా కనీసం వాడుతూ ఉండాలి. లేదంటే ఇది సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపిస్తుంది. బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు చేయాల్సిన పని లేకుండా యూపీఐ ద్వారా వెసులుబాటు ఉంది కాబట్టి దానిని వాడుతూ మినిమం లావాదేవీలు అయినా జరుపుతూ ఉండాలి.
చాలా ఏళ్లుగా ఇలా ఉండిపోతే దానికి యాక్టివ్ మోడ్లో ఉంచడానికి వెంటనే బ్యాంకులకు ఈ విషయం చెప్పి రిక్వెస్ట్ చేయాలి. కొన్ని బ్యాంకులు రీ యాక్టివేట్ చేయడానికి వివిధ రుసుములను విధిస్తాయి. కేవైసీ అప్ డేట్ చేయమని బ్యాంకులు ఎప్పుడు మెసేజ్ చేసినా దానిని నిర్లక్ష్యం చేయకూడదు. యాక్టివేట్ చేసే సమయంలో కొన్నిసార్లు కేవైసీ అప్ డేట్ విషయమే పెద్ద సమస్యగా మారుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY