కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించదలిచిన కరోనా ర్యాపిడ్ టెస్టులను రెండు రోజులపాటు నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం నాడు మరో ప్రకటన విడుదల చేసింది. యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టులు ఎక్కువగా పరిస్థితిని అంచనా వేయడానికే మాత్రమే ఉపయోగపడుతాయని, కరోనా నిర్ధారణకు కేవలం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ఐసీఎంఆర్ సూచించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో అన్ని రాష్ట్రాలు ఐసీఎంఆర్ ప్రోటోకాల్ను అనుసరించాలని పేర్కొన్నారు.
“ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ర్యాపిడ్ టెస్టులను ఎక్కువగా నిర్వహించడం మొదలైంది. అయితే వ్యక్తులలో ప్రతిరోధకాలు గుర్తించడానికే ఈ టెస్టు ఎక్కువుగా ఉపయోగపడుతుంది. ర్యాపిడ్ టెస్టుల యొక్క ఫలితాలు క్షేత్ర పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి. ఐసీఎంఆర్ నిర్ధారణ ప్రకారం, యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టులు, కరోనా నిర్ధారణ కోసం మొదటినుంచి పాటిస్తున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టులను భర్తీ చేయలేవని” ప్రకటించారు.
#CoronaUpdatesInIndia@ICMRDELHI has forwarded a protocol for using Rapid Antibody Test to all States. It is reiterated that antibody rapid tests are largely to be used as a tool for surveillance.
More details here:https://t.co/gChb7m1849@PMOIndia @drharshvardhan @PIB_India
— Ministry of Health 🇮🇳 #StayHome #StaySafe (@MoHFW_INDIA) April 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]