ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో పోరాటానికి సిద్ధమైంది. శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో భాగంగా ఈరోజు రెండవ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి తద్వారా సిరీస్ ను కైవసం చేసుకోవటానికి టీమిండియా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్తో పాటు ఇషాన్ కిషాన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఇప్పటికే వరుసగా 10 మ్యాచ్ లు గెలిచి రికార్డు విజయాలు నమోదు చేసుకున్న భారత జట్టు ఈరోజు జరిగే మ్యాచ్ లో కూడా ఘన విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లతో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. అయితే, ఫీల్డింగ్ విభాగంలో భారత్ మెరుగుపడాల్సి ఉంది. ఇదే విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒప్పుకున్నాడు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు రోహిత్. మరోవైపు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ లో నిలవాలని శ్రీలంక భావిస్తోంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలహీనంగా కనిపిస్తున్న లంక ఈ మ్యాచ్ గెలవాలంటే చెమటోడ్చాల్సిందే. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
జట్ల అంచనా
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ అగర్వాల్
శ్రీలంక: పథుమ్ నిశాంక, కమిల్ మిశారా, చరిత్ అసలంక, దినేశ్ చండిమాల్ (వికెట్ కీపర్), జనిత్ లియనాగె, దసున్ శనక (కెప్టెన్), చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లాహిరు కుమార, దనుష్క గుణతిలక, ఆషియాన్ డేనియల్, శిరన్ ఫెర్నాండో, బినుర ఫెర్నాండో
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ