మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్గా నియమించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రెండ్రోజులు క్రితం రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించిన గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. గౌతమ్ సవాంగ్ స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. బదిలీ సమయంలో గౌతమ్ సవాంగ్ ను సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. తాజాగా గౌతమ్ సవాంగ్ కు ఏపీపీఎస్సీ ఛైర్మన్గా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ నియామకంపై ఇంకా అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ