దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తి తగ్గుముఖ స్థాయికి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 28, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,86,371 కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. మరోవైపు కరోనా వలన మరో మరణం (కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,771కి పెరిగింది.
అలాగే మరో 140 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,53,343 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య ప్రస్తుతం 2,257 కి చేరింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,00,540 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.17 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE