దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 50210 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 5, గురువారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 83,64,086 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 704 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,24,315 కి పెరిగింది. మరోవైపు ఇటీవల కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఒకేరోజులో 55,331 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 77,11,809 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 92.20 శాతం గానూ, మరణాల రేటు 1.49 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 5,27,962 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ