భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో ప్రతి రోజు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ 3.5 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 10,667 కరోనా పాజిటివ్ కేసులు, 380 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూన్ 16, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,43,091 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ 4వ స్థానంలో నిలిచింది.
అలాగే కొత్తగా నమోదైన 380 మరణాలతో కలిపి కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 9,900 కి చేరింది. ప్రపంచంలో కరోనా మరణాల్లో భారత్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. మొత్తం కరోనా బాధితుల్లో 1,80,013 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,53,178 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా తీవ్ర ప్రభావంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కాగా దేశవ్యాప్తంగా చికిత్స తీసుకుంటున్న కరోనా బాధితుల సంఖ్య కంటే వైరస్ లక్షణాలు నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారిసంఖ్య ఎక్కువుగా ఉండడం ఊరట కల్గిస్తుంది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 16 June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 343,091
▶️ Active cases: 153,178
▶️ Cured/Discharged/Migrated: 180,013
▶️ Deaths: 9,900#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/so9heFDEpJ
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 16, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu