భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 48268 కేసులు, 551 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 31, శనివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 81,37,119 కు, మరణాల సంఖ్య 1,21,641 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 74 లక్షలు దాటింది. ఒకే రోజులో 59,454 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 74,32,829 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 91.34 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.49 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 31, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 81,37,119
- కొత్తగా నమోదైన కేసులు [అక్టోబర్ 30–అక్టోబర్ 31(8AM-8AM)] : 48268
- నమోదైన మరణాలు : 551
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 74,32,829
- యాక్టీవ్ కేసులు : 5,82,649
- మొత్తం మరణాల సంఖ్య : 1,21,641
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu