దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత కొన్ని రోజులుగా 30 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 400 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 26,382 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 16, బుధవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 99,32,547 కు చేరుకుంది. కరోనాతో మరో 387 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,44,096 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 94 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకేరోజులో 33,813 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 94,56,449 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 95.21 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ప్రస్తుతం 3,32,002 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ