దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు, 3876 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,49,992 కి పెరిగింది. కాగా గత కొన్ని రోజులతో పోల్చితే రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి.
దేశంలో కరోనా రికవరీ రేటు 82.75 శాతం, మరణాల రేటు 1.09 శాతం:
ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 37,15,221 (16.16%) చేరువైంది. మరో 3,56,082 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,90,27,304 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 82.75 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మే 11, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 30,56,00,187
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 2,29,92,517
- కొత్తగా నమోదైన కేసులు [మే 10– మే 11 (8AM-8AM)] : 3,29,942
- నమోదైన మరణాలు : 3876
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,90,27,304
- యాక్టీవ్ కేసులు : 37,15,221
- మొత్తం మరణాల సంఖ్య : 2,49,992
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ