భారత్ లో గత కొన్ని రోజులుగా మళ్ళీ కరోనా కేసుల్లో పెరుగుదల కన్పిస్తుంది. రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు 2.44 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 44,230 పాజిటివ్ కేసులు నమోదవగా, 555 మంది మరణించారు. దీంతో జూలై 30, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,72,344 కు, మరణాల సంఖ్య 4,23,217 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
గత 24 గంటల వ్యవధిలో 42,360 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 3,07,43,972 కు చేరుకుంది. ఇక కరోనా రికవరీ రేటు 97.38 శాతం గానూ, మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 4,05,155 (1.28%) మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ