మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 30, శుక్రవారం నాడు 6,600 కరోనా కేసులు, 231 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,96,756 దాటగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,32,566 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 7,431 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 60,83,319 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.61 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.1 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 77,494 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పుణేలో అత్యధికంగా 16001 యాక్టీవ్ కేసులు ఉండగా, సతారాలో 7936, సంగ్లీలో 7656, కొల్హాపూర్ లో 6581, థానేలో 5990, అహ్మెద్ నగర్ లో 5445, ముంబయిలో 5402 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 4,77,60,862 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ