దేశంలో కరోనా నుంచి కోలుకున్న 70 లక్షలకు పైగా బాధితులు, రికవరీ రేటు 89.78 శాతం

Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, coronavirus india, India Coronavirus, India Covid-19 Updates, New Confirmed Corona Cases, total corona cases in india today, total corona positive in india

భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78 లక్షలు దాటింది. అక్టోబర్ 22, శనివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 78,14,682 కు, మరణాల సంఖ్య 1,17,956 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 53,370 కరోనా పాజిటివ్ కేసులు, 650 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న బాధితులు సంఖ్య 70 లక్షలు దాటింది.

గత 24 గంటల్లో 67,549 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 70,16,046 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 89.78 శాతంగా నమోదైంది. కాగా కరోనా మరణాల రేటు 1.51 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 6,80,680 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు అక్టోబర్ 23 నాటికీ 10,13,82,564 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 12,69,479 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + one =