భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89 లక్షలు దాటింది. అయితే గత కొన్ని రోజులుగా 50 వేలకంటే తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,617 కరోనా కేసులు, 474 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 89,12,907 కు, మరణాల సంఖ్య 1,30,993 కు చేరుకుంది.
మరోవైపు కొత్తగా 44,739 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 83,35,109 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 93.52 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. అలాగే దేశంలో ప్రస్తుతం 4,46,805 మంది చికిత్స పొందుతున్నారు. ఇక నవంబర్ 17 నాటికీ మొత్తం 12,74,80,186 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 9,37,279 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ