తెలంగాణ రాష్ట్రంలో మరో 948 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 17, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,59,776 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ఐదుగురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1415 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.
కరోనా నుంచి కొత్తగా 1,607 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,45,293 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 94.42 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం 13,068 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 154, మేడ్చల్ లో 83, రంగారెడ్డిలో 76, భద్రాద్రి కొత్తగూడెంలో 61, కరీంనగర్ లో 55, నల్గొండలో 45, ఖమ్మంలో 44, వరంగల్ అర్బన్ లో 40 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ