తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా కేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేయగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గోరటి వెంకన్న, బస్వారాజు సారయ్య, బోగారపు దయానంద్ శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు పలువురు మంత్రులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ