భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసులు 99 లక్షలు దాటగా, రికవరీ అయినా వారి సంఖ్య 94 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 22065 పాజిటివ్ కేసులు, 354 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 99,06,165 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,43,709 కి పెరిగింది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో 3,39,820 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 34,477 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 94,22,636 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 95.12 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 15, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 15,55,60,655
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 99,06,165
- కొత్తగా నమోదైన కేసులు [డిసెంబర్ 14–డిసెంబర్ 15 (8AM-8AM)] : 22065
- నమోదైన మరణాలు : 354
- రికవరీ అయిన వారి సంఖ్య : 94,22,636
- యాక్టీవ్ కేసులు : 3,39,820
- మొత్తం మరణాల సంఖ్య : 1,43,709
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ