దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 5 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,116 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,90,991 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 47 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,15,850 కి పెరిగింది. ఇక దేశంలో కొత్తగా 5,559 కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,24,37,072 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.71 శాతంగానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
ప్రస్తుతం 38,069 (0.09%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద మార్చి 13, ఆదివారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించబడ్డ కరోనా వ్యాక్సిన్ డోసులు సంఖ్య 180 కోట్లు దాటినట్టు (1,80,13,23,547) కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే గత 24 గంటల్లో 20 లక్షలకుపైగా (20,31,275) వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ