దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 1,86,364 కరోనా కేసులు నమోదవడంతో మే 28, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 చేరుకుంది. గత 44 రోజుల్లో రోజువారీగా నమోదైన కరోనా కేసుల్లో ఇదే(1,86,364) కనిష్టం. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 3,660 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,18,895 కి పెరిగింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
దేశంలో 23 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 90.34 శాతం:
ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, రాజస్థాన్, అస్సాం, పంజాబ్ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 23,43,152 (8.50%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 2,59,459 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 2,48,93,410 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 90.34 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.16 శాతంగా ఉంది. ఇక మే 27, గురువారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 33,90,39,861 కు చేరుకుంది. గత 24 గంటల్లో 20,70,508 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ