తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. అలాగే ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే, అది తెలుగువారందరికీ గర్వ కారణమని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. ”ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లుగా, తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారకరామారావు గారికి భారతరత్న ఇస్తే, అది తెలుగువారందరికీ గర్వ కారణం. ఆయన నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా వారిని స్మరించుకుంటుంటున్నాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ