దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మళ్ళీ క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో 3,02,115 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2541 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారి పాసిటివిటీ రేటు 0.84 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,30,60,086 కు చేరుకుంది. అలాగే కొత్తగా 30 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,22,223 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, హర్యానా, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 1,862 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,25,21,341 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 16 వేలకుపైగా (16,522 – 0.04%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధిక కరోనాకేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఏప్రిల్ 24 (8am)–ఏప్రిల్ 25 (8am)):
- ఢిల్లీ – 1083
- హర్యానా – 417
- కేరళ – 281
- ఉత్తర్ ప్రదేశ్ – 212
- మహారాష్ట్ర – 144
- మిజోరాం – 107
- కర్ణాటక – 60
- తమిళనాడు – 52
- పశ్చిమబెంగాల్ – 41
- పంజాబ్ – 21
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ