దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా మూడో రోజు 3 లక్షల కంటే కేసులు తక్కువుగా నమోదవగా, వరుసగా ఆరో రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం భారీ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. దేశంలో కరోనా వెలుగులోకి వచ్చాక ఒకరోజు వ్యవధిలో అత్యధికంగా కరోనా మరణాలు(4529) నమోదవడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,67,334 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,54,96,330 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 4529 మంది మరణించడంతో మరణాల సంఖ్య 2,83,248 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 32,26,719 (12.66%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి.
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 74 శాతం 10 రాష్ట్రాల్లోనే:
కొత్తగా తమిళనాడు (33,059), కేరళ (31,377), కర్ణాటక (30,309), మహారాష్ట్ర (28,438), ఆంధ్రప్రదేశ్ (21,320), వెస్ట్ బెంగాల్ (19,428), ఒడిశా (10,321), ఉత్తర్ ప్రదేశ్ (8,673), రాజస్థాన్ (8,398), హర్యానా (7,774) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2,67,334 కేసులలో 74.46 శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. ఇక దేశంలో మరో 3,89,851 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,19,86,363 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 86.23 శాతం గానూ, మరణాల రేటు 1.11 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ