గుజరాత్ రాష్ట్రంలో తౌక్టే తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. తీవ్రస్థాయి తుఫాన్తో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్థి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు గుజరాత్ లో తౌక్టే తుఫాన్ ప్రభావ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ముందుగా గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ, అక్కడి నుంచి ఏరియల్ సర్వేకు వెళ్లారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ప్రధానితో పాటు ఉన్నారు. గుజరాత్ లోని భావ్నగర్, అమ్రేలి, గిర్ సోమనాథ్ జిల్లాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యులో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. మరోవైపు సర్వే అనంతరం నష్ట అంచనా, పునరుద్ధరణ పనులు, సహాయక చర్యలపై అహ్మదాబాద్లో సీఎం విజయ్ రూపాని, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ