దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 30,615 కరోనా కేసులు, 514 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,27,23,558 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,09,872 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, మిజోరాం, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 82,988 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,18,43,446 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.94 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 3,70,240 (0.87%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఫిబ్రవరి 15 (8am)–ఫిబ్రవరి 16 (8am)):
- కేరళ – 11,776
- మహారాష్ట్ర – 2,831
- మిజోరాం – 1,616
- కర్ణాటక – 1,405
- రాజస్థాన్ – 1,387
- తమిళనాడు – 1,325
- మధ్యప్రదేశ్ – 1,222
- ఉత్తర్ ప్రదేశ్ – 1,189
- గుజరాత్ – 998
- ఒడిశా – 925
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ