దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 3,375 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,94,487 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో ముఖ్యంగా కేరళ (1155), తమిళనాడు (509), మహారాష్ట్ర (460), వెస్ట్ బెంగాల్ (228), కర్ణాటక (153), ఒడిశా (146), ఢిల్లీ (93), గుజరాత్ (91), తెలంగాణ (84) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. అలాగే కరోనా వలన మరో 18 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,673 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 37 వేలుకుపైగా (37,444 (0.08%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి..
కొత్తగా 4,206 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,40,28,370 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.73 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద అక్టోబర్ 2, ఆదివారం ఉదయం 7 గంటల వరకు 218.75 కోట్లకుపైగా (2,18,75,36,041) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 6,90,194 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY