ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు (అక్టోబర్ 2, ఆదివారం) మధ్యాహ్నం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నేడు మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానంకు సీఎం వైఎస్ జగన్ చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక దసరా పండుగ సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అలాగే అధికారులు కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు భారీగా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY