తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్ల ఉపఎన్నిక కోసం ఈ రోజున (మార్చి 23, మంగళవారం) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం, తిరుపతి లోక్ సభ స్థానం ఉపఎన్నిక కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నాగార్జునసాగర్ లో ఈ రోజు ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు.
ఈ రెండు చోట్ల మార్చి 30 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన మార్చి 31 న జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరుతేదీగా ఏప్రిల్ 3 ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. నేటి నుంచే నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుండడంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఉపఎన్నికల సందడి మొదలుకానుంది. ఈ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహరచన ప్రారంభించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ