మణిపూర్ రాష్ట్రంలో తోలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ సోమవారం 38 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. తొలిదశ పోలింగ్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 48.88 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
5 జిల్లాల్లోని 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి 173 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో మొత్తం 12 లక్షల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ పక్రియ కోసం 1721 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఈ దశలో పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హీంగాంగ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్, సింగ్జమీ నుంచి స్పీకర్ వై ఖేమ్చంద్ సింగ్, ఉరిపోక్ నుంచి ఉప ముఖ్యమంత్రి యుమ్నామ్ జోయ్కుమార్ సింగ్, నంబోల్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.లోకేష్ సింగ్ పోటీలో ఉన్నారు. మణిపూర్ లో బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, జనతాదళ్, నాగా పీపుల్స్ ఫ్రంట్ వంటి పార్టీలు బరిలో ఉన్నాయి. ఇక మార్చి 5న రెండోదశ కింద 22 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మార్చి 10 తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ