దేశంలో 80 వేలు దాటిన కరోనా మరణాలు, ఒకే రోజులో 79292 మంది డిశ్చార్జ్

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, India Corona Updates, India Coronavirus, India Covid-19 Updates, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in india

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల దేశంలో పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 49 లక్షలు దాటింది. సెప్టెంబర్ 15, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,30,236 కు, మరణాల సంఖ్య 80,776 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 83,809 కరోనా పాజిటివ్ కేసులు, 1054 కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా దేశంలో కరోనా మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 38 లక్షలు దాటింది. ఒకే రోజులో 79,292 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 38,59,399 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 78.3 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 9,90,061 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 18 =