భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 88,600 పాజిటివ్ కేసులు నమోదవగా, 1124 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 27, ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 59,92,532 కు, మరణాల సంఖ్య 94,503 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 92,043 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 49,41,627 కు చేరుకుంది.
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 82.5 శాతం గానూ, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 9,56,402 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu