నీతి ఆయోగ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా మాజీ ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. నీతి ఆయోగ్ సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు నీతి ఆయోగ్ సీఈవోగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన నేపథ్యంలో నూతన నీతి ఆయోగ్ సీఈవో నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు, ఏది ముందుగా వర్తిస్తే అప్పటివరకు నీతి ఆయోగ్ సీఈవోగా కొనసానున్నట్టు నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కు చెందిన బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఛత్తీస్గఢ్ కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండగా, లండన్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్మెంట్ డిగ్రీని కూడా పొందారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రైవేట్ సెక్రటరీగా, పీఎంవోలో, ఛత్తీస్గఢ్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా, అడిషనల్ చీఫ్ సెక్రెటరీగా (హోమ్), జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రెటరీగా, కేంద్ర కామర్స్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు కామర్స్ సెక్రెటరీగా, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ చైర్మన్, ఎండీగా వివిధ హోదాల్లో సేవలు అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE