దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. వరుసగా ఆరో రోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,23,144 కేసులు, 2771 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,77,36,307 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,97,894 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్ గడ్, గుజరాత్ వంటి 10 రాష్ట్రాల్లోనే 71.68 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 28,82,204 (16.34%) కు చేరుకుంది. మరో 2,51,827 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,45,56,209 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 82.54 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.12 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (ఏప్రిల్ 26 8am–ఏప్రిల్ 27 8am) :
- మహారాష్ట్ర – 48700
- ఉత్తరప్రదేశ్ – 33551
- కర్ణాటక – 29744
- కేరళ – 21890
- ఢిల్లీ – 20201
- రాజస్థాన్ – 16438
- వెస్ట్ బెంగాల్ – 15992
- తమిళనాడు – 15684
- ఛత్తీస్ ఘడ్ – 15084
- గుజరాత్ – 14340
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 524
- ఢిల్లీ – 380
- ఉత్తర్ ప్రదేశ్ – 249
- ఛత్తీస్ ఘడ్ – 226
- కర్ణాటక – 201
- గుజరాత్ – 158
- జార్ఖండ్ – 124
- పంజాబ్ – 98
- తమిళనాడు – 94
- మధ్యప్రదేశ్ – 88
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ