కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ కు మద్దతుగా పలు దేశాలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య గురువారం రాత్రి ఫోన్ లో మాట్లాడారు. ఫోన్ సంభాషణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. “అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ఫోన్లో మాట్లాడాను. గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ కోసం అమెరికా స్ట్రాటజీలో భాగంగా భారతదేశానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని అభినందిస్తున్నాను. అమెరికా ప్రభుత్వం, బిజినెస్ వర్గాలు మరియు ప్రవాస భారతీయుల నుండి మద్దతు మరియు సంఘీభావం తెలిపినందుకు ఆమెకు కృతజ్ఞతలు. భారతదేశం-అమెరికా వ్యాక్సిన్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలు మరియు కోవిడ్ అనంతర ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక పునరుద్ధరణకు దోహదం చేయడానికి ఇరుదేశాల భాగస్వామ్యం యొక్క సామర్థ్యాన్ని కూడా చర్చించాము” అని ప్రధాని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ