దేశం విడిచి పరారైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు ప్రజాగ్రహానికి తలొంచారు. పలు నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు గొటబాయ శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద అబేవర్దన్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం గొటబాయ సింగపూర్ దేశంలో తలదాచుకున్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా పంపారు. గురువారం రాత్రి సింగపూర్లోని శ్రీలంక హైకమిషన్ ద్వారా రాజపక్స రాజీనామా లేఖను స్పీకర్ స్వీకరించారు.
దీంతో స్పీకర్ అబేవర్దన్, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసినట్లు శుక్రవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. మరో వారం రోజుల్లో నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటామని, అప్పటివరకు ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని స్పీకర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే మరో 7 రోజుల్లో పూర్తి చేసే ఈ ప్రక్రియలో చట్టసభ సభ్యులందరూ పాల్గొనేలా దేశంలో శాంతియుత వాతావరణం కల్పించాలని స్పీకర్ ప్రజలను కోరారు. కాగా శ్రీలంక పార్లమెంటు శనివారం సమావేశం కానుంది. గత శనివారం, రాజపక్స తన అధికారిక నివాసాన్ని వేలాది మంది నిరసనకారులు ముట్టడించిన అనంతరం దేశం సరిహద్దులకు పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా మాల్దీవులకు పారిపోయారు. మాల్దీవుల నుంచి ఆయన గురువారం సింగపూర్ వెళ్లారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ