దేశంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 2,95,894 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 4,043 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 1.37 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,45,43,089 కు చేరుకుంది. కొత్తగా మరో 15 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,370 కి పెరిగింది. అలాగే మరో 4,676 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,39,67,340 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 47,379 (0.11%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (సెప్టెంబర్ 19 (8am)–సెప్టెంబర్ 20 (8am)):
- కేరళ – 1821
- తమిళనాడు – 498
- మహారాష్ట్ర – 292
- కర్ణాటక – 253
- పశ్చిమబెంగాల్ – 139
- ఒడిశా – 125
- తెలంగాణ – 105
- ఛత్తీస్ గడ్ – 93
- రాజస్థాన్ – 87
- గుజరాత్ – 77
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY